సెప్టెంబర్లో శ్రీరామరాజ్యం
ప్రముఖ దర్శకుడు బాపు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో వాల్మీకిగా డా.అక్కినేని నాగేశ్వరరావు, లక్ష్మణుడిగా శ్రీకాంత్, సీతగా నయనతార, భరతునిగా సాయికుమార్, ఆంజనేయుడిగా విందు ధారాసింగ్, కౌసల్యగా కె.ఆర్.విజయ, జనకునిగా మురళీమోహన్, వశిష్టుడిగా సీనియర్ బాలయ్య, భూదేవిగా జయసుధ, చాకలి తిప్పనిగా బ్రహ్మానందం...ఇలా భారీ తారాగణం నటిస్తున్నారు. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. కథానుసారం కోట్ల రూపాయల వ్యయంతో ఈ చిత్రాన్ని సాయిబాబు ఏ మాత్రం రాజీపడకుండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్లో విడుదల కానుంది!
No comments:
Post a Comment